| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా తీన్మార్ మల్లన్న

News

Posted on 2023-11-10 11:39:43

Share: Share


కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా తీన్మార్ మల్లన్న

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు.. పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది.

మొదట తన సొంత పార్టీ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన మల్లన్న.. తన పార్టీ లీగల్ వ్యవహారాలు కొలిక్కి రాకపోవటంతో.. కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు.

కానీ.. కాంగ్రెస్ నాయకత్వం జరిపిన చర్చల తర్వాత.. పార్టీలో అధికారికంగా చేరటమే కాకుండా.. ఆ పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా తన భుజాలకు ఎత్తుకున్నారు తీన్మార్ మల్లన్న.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై.. కేసీఆర్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే మల్లన్నకు సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

దీంతో.. ఆయన మాటలకు, ప్రభుత్వాన్ని నిలదీసే విధానాన్ని ఈ ఎన్నికల్లో వాడుకునేందుకు కాంగ్రెస్ పెద్ద ప్లానే వేసింది. పార్టీలో చేరిన తెల్లారే.. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించింది.

అయితే.. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్.. ఎల్బీనగర్ బరిలో ఉండటంతో.. క్యాపెయినింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు మల్లన్న చూసుకోనున్నాడు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి మాటల తూటలతో ప్రత్యర్థులను బహిరంగ సభలలో నిలదీస్తుండగా.. ఆయనకు మల్లన్న తోడవటంతో కాంగ్రెస్ ప్రచారం మరో స్థాయికి చేరనుదని శ్రేణులు భావిస్తున్నాయి.

కన్వీనర్‌గా నియమిస్తూ వెల్లడించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొనగా.. ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్, ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. నామినేషన్లకు ఈరోజు ఒక్కరోజే సమయం ఉండటంతో.. ఆ పర్వం పూర్తయిన వెంటనే ప్రచార ప్రక్రియను వేగవంతం చేసేలా ప్లాన్ చేయనున్నారు.

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >