Posted on 2024-09-11 05:34:50
డైలీ భారత్, వేములవాడ: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగిస్తూ గాయపర్చిన ముగ్గురు వ్యక్తులకి 01 సంవత్సరం జైలు శిక్షతో పాటుగా ఒక్కకరికి 1000/- రూపాయల జరిమాన.
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని గాయపర్చి అతని విధులకి ఆటంక పర్చిన ముగ్గురు నిందుతులకు ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు ఒక్కకరికి 1000/-రూపాయల జరిమానా విధిస్తూ వేములవాడ JFCM మేజిస్ట్రేట్ జ్యోతిర్మయి మంగళవారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాల మేరకు 2016 సంవత్సరం నందు వేములవాడ స్టేషన్ కి చెందిన శ్రీకర్ అనే కానిస్టేబుల్ జాతర గ్రౌండ్ వద్ద విధులు నిర్వర్తించుచుండగా వేములవాడ కి చెందిన MD రహిమొద్దిన్, కూసం మధు మరియు సంటి మహేష్ అను ముగ్గురు వ్యక్తులు బండి పై ట్రిపుల్ రైడింగ్ మరియు రాష్ గా నడుపుతూ వస్తుండగా వారిని శ్రీకర్ కానిస్టేబుల్ ఆపి అలా ఎందుకు వెళ్ళుచున్నారు అని అడుగగా వారు కానిస్టేబుల్ నీ నీకెందుకు అని తొసివేస్తూ, అతని విధులకు ఆటంక పరచినందుకు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అప్పటి వేములవాడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ముగ్గురు పై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాగా,CMS ఎస్. ఐ రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సురేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.ప్రాసిక్యూషన్ తరపున APP విక్రాంత్ వాదించగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నిందుతులు అయిన MD రహిమొద్దిన్,కూసం మధు, సంటి మహేష్ లకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు ఒక్కకరికి 1000/- రూపాయలు జరిమానా విధించినట్లు వేములవాడ పట్టణ సి.ఐ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >