Posted on 2024-09-11 08:53:11
ముఖ్యఅతిథిగా ఏఎన్ఆర్ వారసుడు ఆవుల రాజిరెడ్డి
కలలో కూడా ఊహించని మాసాయిపేట స్కూల్ మైదానం
గ్రామ యువకులు గ్రామ ప్రజలు ఆనందం వెల్లడి
డైలీ భారత్, మాసాయిపేట: ఈనెల 21 నుండి 23 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగు రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొని క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రమైన మాసాయిపేట ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిందని అన్నారు అనంతరం జిల్లా వ్యాప్తంగా ఈ ఎంపిక కార్యక్రమంలో 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు ముఖ్యఅతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి హాజరైనారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ నా సొంత గ్రామంలో చదువుకున్న పాఠశాలలో నేను ముఖ్యఅతిథిగా రావడం ఆనందం వ్యక్తం చేస్తున్నానని అన్నారు ఏనాడు ఇలాంటి అవకాశం రావడం జరుగుతుందని కలలో కూడా ఊహించని విషయం అని ఆవేదనతో వ్యక్తం చేశారు అదేవిధంగా ఎంతోమంది నా సొంత గ్రామం నుండి ఇతర పదవులలో ఉన్నారు అని తెలిపారు అదేవిధంగా నేను చదువుకున్న పాఠశాలలో నేను ఆటలు ఆడుకున్న ఈ మైదానంలో నా చేతుల మీదుగా క్రీడా శాఖ విద్యార్థులను గురించి మాట్లాడడం ఆనందంగా ఉందని మాట్లాడారు అనంతరం మాసాయిపేట మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న యువకులందరూ మాసాయిపేట మండలం కేంద్రంలోని మైదానం ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ గౌడ్ తెలిపారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, తాజా మాజీ ఉపసర్పంచ్ ఉదండపురం నాగరాజు, మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాసాయిపేట మాజీ తాజా ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ పట్నం శివరాములు,వెల్దుర్తి నరేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు ముక్క దశరథ క్రీడా శాఖల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >