Posted on 2024-09-10 22:31:31
హాజరైన ప్రజాప్రతినిధులు
డైలీ భారత్, తూప్రాన్: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ సమీపము లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని వద్ద మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ,తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్,కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, ఉమా సత్య లింగం, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, డాక్టర్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ కల్లూరి సంతోష్, ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ సంఘం నాయకులు హాజరై గణనాథునికి విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, కిష్టారెడ్డి , షీందే చంద్రం, రఘుపతి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పర్సా నర్సింగరావు , రాజు, శ్యామల అశోక్, కోరవోయిన ప్రవీణ్, అనిల్, రమేష్, అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >