Posted on 2024-09-10 22:27:01
కులం పేరుతో దూషించిన వారిపై ఫిర్యాదు
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల్ లోని శేమ్నాపూర్ గ్రామంలోఆదివారం రోజున. ఎస్సీ మాదిగ కులానికి చెందిన మహిళ భాగ్యమ్మ. గ్రామంలో కషీర్ వద్ద మతాలకు అతీతంగా నిలుపుకున్న వినాయకుడికి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లిన వారిని. నీవు వినాయకునికి కొబ్బరికాయ కొట్టొద్దు అంటూ కులం పేరుతో దూషించి మెడబట్టి గెంటేయడం . అసభ్యకరమైన బూతులు తిడుతూ. మొఖంపై పిడిగుద్దులు గుద్దారు . మాదిగ కులానికి చెందిన కొమ్మాట భాగ్యమ్మ పక్కనే ఉన్న భర్త సిద్ధిరాములు పై దాడి చేయడం విపరీతంగా కొట్టడం జరిగింది. అదే గ్రామానికి చెందిన. బిసి రెడ్డి అగ్రకులస్తులు కులం పేరుతో దూషించినా . కారకులైన దోషులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని. మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హస్తరు గల్ల బాలరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి.రవి డిమాండ్ చేస్తూ మెదక్ డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ అవమానించినందున ఈ సంఘటన తెలుసుకున్న మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీ నాయకులు నిజ నిర్ధారణ కమిటీతో శేమ్నపూర్ గ్రామాన్ని సందర్శించారు కులం పేరుతో దూషించిన కుటుంబాన్ని పరామర్శించి మేమున్నామని ధైర్యం చెప్పడం జరిగింది. ఇలాంటివి.. గతంలో ఎన్నో. దళితులపై దాడులు. అవమానాలు. కుట్రపూరితమైన అణిచివేతలు. జరుగుతూనే ప్రస్తుతం వినాయక చవితి. సందర్భంగా జరగడం దురదృష్టం అన్నారు. ఏదేమైనా. మహిళా బాధితురాలు భర్తపై. కులం పేరుతో దాడి చేసిన. దుండగులను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పరంగా అరెస్టు చేసి రిమాండ్ చేయకుంటే. రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో. ఉద్యమాలు ఉధృతం చేస్తామని. హెచ్చరించారు. ఇలాంటివి మళ్లీ. పునరావత్వం కాకుండా. కట్టుదిట్టమైన చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవాలని. లేనియెడల. పరస్పరం భౌతిక దాడులు తప్పవని.కారకులైన అగ్రకులాలకు హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు. రాములుబాబు శ్రీనివాస్. ఘనపూర్ మండల అధ్యక్షులు సంజీవులు మాదిగ. తదితరులు పాల్గొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >