Posted on 2024-09-06 17:27:47
కందుకూర్ ను మున్సిపాలిటీగా చేయాలని నేతల డిమాండ్
ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కందుకూర్ మండలానికి నాల్గో సిటీ రావటంతో ఈ ప్రాంతం మహానగరంగా మారనుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కార్యాలయంలో కేఎల్ఆర్ ను కలిసి కందుకూర్ ను మున్సిపాలిటీగా మార్చాలని హస్తం నేతలు కోరారు. జనాభా పెరగటం, ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీతో మరింత అభివృద్ధి కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలంలోని 16 గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా మారిస్తే బాగుంటుందని కందుకూర్ మండల నాయకులు కేఎల్ఆర్ దృష్టికి తెచ్చారు. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తామని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మహేశ్వరం మండల కేంద్రాన్ని 12 గ్రామపంచాయతీలతో మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి సీఎంవోకు పంపుతామని కిచ్చెన్నగారు కాంగ్రెస్ నేతలకు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మహానగరంగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని కేఎల్ఆర్ గుర్తు చేశారు.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >