Posted on 2024-09-06 17:27:47
కందుకూర్ ను మున్సిపాలిటీగా చేయాలని నేతల డిమాండ్
ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కందుకూర్ మండలానికి నాల్గో సిటీ రావటంతో ఈ ప్రాంతం మహానగరంగా మారనుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కార్యాలయంలో కేఎల్ఆర్ ను కలిసి కందుకూర్ ను మున్సిపాలిటీగా మార్చాలని హస్తం నేతలు కోరారు. జనాభా పెరగటం, ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీతో మరింత అభివృద్ధి కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలంలోని 16 గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా మారిస్తే బాగుంటుందని కందుకూర్ మండల నాయకులు కేఎల్ఆర్ దృష్టికి తెచ్చారు. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తామని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మహేశ్వరం మండల కేంద్రాన్ని 12 గ్రామపంచాయతీలతో మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి సీఎంవోకు పంపుతామని కిచ్చెన్నగారు కాంగ్రెస్ నేతలకు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మహానగరంగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని కేఎల్ఆర్ గుర్తు చేశారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >