| Daily భారత్
Logo




అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామపంచాయతీలు చేస్తాం : సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

News

Posted on 2023-11-04 12:59:27

Share: Share


అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామపంచాయతీలు చేస్తాం : సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ లో  విలీనమైన గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఒకటో వార్డు రగుడు లో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆవిడ ప్రారంభించారు. ఈ సందర్భంగా రగుడు, చెంద్రంపెట, శ్రీనగర్ కాలనీ, శాంతినగర్, అంబేద్కర్ నగర్, రెడ్డివాడ, రాళ్ళబావి, పెద్దబజార్, లాల మల్లేశం బజార్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా, 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి, సిరిసిల్ల ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయకుండా నిర్బంధాలకు, అక్రమాలకు, అరెస్టులకు తెరలేపిన కేటీఆర్ ను గద్దె దింపడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో బిజెపి అభ్యర్థిగా తాను సిరిసిల్లకు రావడం జరిగిందన్నారు. విలీన గ్రామాలకు న్యాయంగా దక్కవలసిన హక్కులను కేటీఆర్ కాలరాసాడని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనను అసెంబ్లీకి పంపిస్తే కొట్లాడి విలీన గ్రామాలను మళ్ళీ గ్రామపంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతుందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సిరిసిల్లాను దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. విద్యా, వైద్యం ,ఉపాధికి బిజెపి పెద్దపీట వేస్తుందని, కమిషన్ల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ నాయకులను ఓడించి, సబండ వర్గాల కోసం పనిచేస్తున్న బిజెపిని ఆదరించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు అవకాశాలు ఇచ్చారని ఇప్పుడు బిజెపి పార్టీ అభ్యర్థిగా ఒక ఆడబిడ్డగా వచ్చిన తనను సిరిసిల్ల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో బిజెపి జిల్లా, మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >