| Daily భారత్
Logo




అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామపంచాయతీలు చేస్తాం : సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

News

Posted on 2023-11-04 17:29:27

Share: Share


అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామపంచాయతీలు చేస్తాం : సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ లో  విలీనమైన గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఒకటో వార్డు రగుడు లో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆవిడ ప్రారంభించారు. ఈ సందర్భంగా రగుడు, చెంద్రంపెట, శ్రీనగర్ కాలనీ, శాంతినగర్, అంబేద్కర్ నగర్, రెడ్డివాడ, రాళ్ళబావి, పెద్దబజార్, లాల మల్లేశం బజార్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా, 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి, సిరిసిల్ల ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయకుండా నిర్బంధాలకు, అక్రమాలకు, అరెస్టులకు తెరలేపిన కేటీఆర్ ను గద్దె దింపడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో బిజెపి అభ్యర్థిగా తాను సిరిసిల్లకు రావడం జరిగిందన్నారు. విలీన గ్రామాలకు న్యాయంగా దక్కవలసిన హక్కులను కేటీఆర్ కాలరాసాడని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనను అసెంబ్లీకి పంపిస్తే కొట్లాడి విలీన గ్రామాలను మళ్ళీ గ్రామపంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతుందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సిరిసిల్లాను దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. విద్యా, వైద్యం ,ఉపాధికి బిజెపి పెద్దపీట వేస్తుందని, కమిషన్ల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ నాయకులను ఓడించి, సబండ వర్గాల కోసం పనిచేస్తున్న బిజెపిని ఆదరించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు అవకాశాలు ఇచ్చారని ఇప్పుడు బిజెపి పార్టీ అభ్యర్థిగా ఒక ఆడబిడ్డగా వచ్చిన తనను సిరిసిల్ల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో బిజెపి జిల్లా, మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >