Posted on 2024-08-02 13:56:03
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేరళలోని వయనాడ్ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 308కి చేరుకుంది.
మండక్కై, చూరాల్ మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యా యి,సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నేవీతోపాటు ఇతర సహాయక బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో బిజీగా ఉన్నాయి.
ఇప్పటి వరకు సైన్యం వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలిం చాయి. ప్రకృతి సృష్టించే విపత్తును అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆ విపత్తును ముందుగానే ఊహిస్తే కాస్త నష్టాన్ని నివారించగలము తప్పా చేసేదేమీ ఉండదు.
అలాంటి అవకాశాన్ని ఇస్రో అందించింది. ఈ సంస్థ రూపొందించి ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20ఏండ్లుగా వయనాడ్ జిల్లాతోపాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతా లను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించింది.
దీనిలో భాగంగా తాజాగా వయనాడ్ జిల్లాలో విల యాన్ని చిత్రీకరించింది. వయనాడ్ లో కొండచరి యలు జారిపడిన ద్రుశ్యాన్ని విలయానికి ముందు విల యం తర్వాత ఫొటోలను ఆ ప్రాంతాలపై దృష్టి సారించింది..
కార్టో శాట్ 3 ఆర్ఐఎస్ఏటీ ఉపగ్రహాలు వాటిని రికార్డు చేశాయి. ఇస్రో అనుబంధ సంస్థ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ 3డీ ఫొటోలను విశ్లేషించింది
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >