Posted on 2024-08-01 13:55:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: గురువారం సిరిసిల్లలో చేనేత పరిశ్రమల ఐక్య వేదిక నిర్వహిస్తున్న నిరసన దీక్షకు రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సంఘీభావం తెలిపింది. అధ్యక్షులు డా.జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా కూడు, గూడు,గుడ్డ కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ చేనేత జీవితాల బతుకులపై పాట రాసి వినిపించారు. సలహా దారులు, ఐ.బి.ఆర్.ఎఫ్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలని,కరెంటు సబ్సిడీని అమలు చేయాలని కోరినారు.
కార్యక్రమంలో చేనేత వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక అనుబంధ సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు, వస్త్ర యజమానులు,కార్మికులు,నాయకులు ఆడెపు రవీందర్, ఏనుగుల ఎల్లయ్య, తాటిపాముల దామోదర్, ఆడెపు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >