Posted on 2024-07-28 13:46:29
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
కమ్మదనం ఫారెస్ట్ రేంజ్ వనమహోత్సవ కార్యక్రమం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:పర్యావరణాన్ని సమతుల్యం చేయడమే ప్రభుత్వ ప్రత్యేక లక్ష్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గ్రామ ఫారెస్ట్ రేంజ్ లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వనమోహత్సవ కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. కమ్మదనం గ్రామపంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికీ గురుకుల పాఠశాల విద్యార్థినీలతో పాటు స్థానిక నాయకులు ఫారెస్ట్ అధికారులతో అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమాన్ని 1950లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న కేఎం.మున్షి నాంది పలికారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్లు మొక్కలు పెంచడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని ఆయన తెలిపారు. అలాగే ఒక్కొక్క వ్యక్తి ఐదు నుంచి పది మొక్కల పెంచాలన్నారు.
షాద్ నగర్ నియోజకవర్గం కమ్మదనం ఫారెస్ట్ రేంజ్ వనమహోత్సవ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అజీజ్, కమ్మదనం మాజీ ఎంపీటీసీఅరుణమ్మ అంజయ్య, మాజీ సర్పంచ్ నర్సింలు, మాజీ డిప్యూటీ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి , జడ్పిటిసి వెంకట్రామ్ రెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి , బాబర్ ఖాన్ ,కమ్మదనం గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కమ్మదనం గురుకుల పాఠశాల విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >