Posted on 2024-07-25 20:10:25
100 గ్రాముల గంజాయి స్వాధీనం.
కొనరావుపేట్ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ ఆంజనేయులు తో కలసి వివరాలు వెల్లడించిన సి.ఐ వెంకటేశ్వర్లు..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కొనరావుపేట్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన వడ్లూరి వెంకటేష్ అనే వ్యక్తి గంజాయి త్రాగడానికి అలవాటు పడి జగిత్యాల జిల్లా కోడీమ్యాల మండలం తిప్పాయిపల్లి మరియు భీమ్గల్ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి అట్టి గంజాయి తగగా మిగిలిన గంజాయి గంజాయి కి అలవాటు పడిన వారికి అమ్ముతుండే వాడు, ఇదే క్రమంలో ఈ రోజు వెంకటేష్ సుద్దాల గ్రామానికి వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు సుద్దాల గ్రామ శివారులో వెంకటేష్ ని అదుపులోకి తీసుకొని 100 గ్రాముల గంజాయి సీజ్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని సి.ఐ తెలిపారు.
నిందుతుని వివరాలు.
1.వడ్లూరి వెంకటేష్ 23y, సుద్దాల గ్రామం,కొనరావుపేట్.
ప్రజలు ఎవరైనా గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించగలరని,యువత డ్రగ్స్ భారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >