Posted on 2024-07-25 17:14:56
డైలీ భారత్, హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. సునీత అనే ఉద్యోగిని సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీతారాంపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి పనిపై ఆఫీసుకు వచ్చారు.
పని చేయటానికి 80 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు సబ్ రిజిస్ట్రార్. దీంతో శ్రీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
పక్కా ప్లాన్ ప్రకారం.. ఏసీబీ అధికారుల సూచనలతో సబ్ రిజిస్ట్రార్ సునీత్ అడిగిన 80 వేల రూపాయలు ఇవ్వటానికి శ్రీకాంత్ ఓకే చెప్పాడు. ఈ క్రమంలోనే 2024, జూలై 25వ తేదీ ఉదయం 80 వేల రూపాయలు లంచం డబ్బు తీసుకుంటుండగా మధ్యవర్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ చేయగా.. సబ్ రిజిస్ట్రార్ సునీతగారు పేరు చెప్పాడు అతను. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆఫీసులోనే తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ గతంలో చేసిన రిజిస్ట్రేషన్లపైనా ఆరా తీస్తున్నారు. పాత రికార్డులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ తనిఖీలతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఉద్యోగులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >