Posted on 2024-07-20 18:29:32
ముత్తారంలో ఇంట్లో చంపి గొనసంచిలో మూటకట్టి బావిలో వేశారు
హత్యలో పాల్గొన్న ముగ్గురు అరెస్ట్
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో గత నెల 8వ తేదీన బావిలో మూటలో దొరికిన మహిళ అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ లో శనివారం సమావేశంలో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్ఐ మధుసూధన్ రావులతో కలిసి నిందితుల వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన ముత్తారంకు చెందిన అమ్ము రజీత అలియస్ లావాణ్య తన ఇంటి సమీపంలో ని పెరక రాజేశ్వరి (65) వద్ద అప్పు లక్ష 50 వేలు అప్పు తీసుకుందని, రాజేశ్వరి తరుచూ అప్పుడబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఆగ్రహంతో 8వ తేదీన అప్పు ఇస్తానని రాజేశ్వరిని ఇంటికి పిలిచిన లావణ్య మరో వ్యక్తి కుక్కముడి తిరుపతితో పాటు భర్త రవి అలియాస్ రమేష్ తో కలిసి ఇంట్లో గొంతు నులిమి చంపి అదే రాత్రి గొనసంచిలో మూటకట్టి బావిలో పారుపల్లికి వేళ్లే వ్యవసాయ బావిలో వేశారన్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురిని శనివారం ఉదయం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూధన్ రావు లు అరెస్ట్ చేశారని తెలిపారు. అప్పు ఇచ్చిన రాజేశ్వరి తమను తరచుగా డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెట్టేదని, అందుకే ఆమెను హత్య చేసి రాజేశ్వరి ఒంటి పై ఉన్న బంగారం తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చమన్నారు. హత్య చేసిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐ లతో పాటు కానిస్టేబుల్స్ దుబాసి రమేష్, బాలగాని కిరణ్ లను ఏసీపీ అభినందించారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >