Posted on 2024-07-19 15:03:49
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో జులై 20 శనివారం రోజున సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పరిస్థితులు తెలియజేయాలని సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో సెస్ ఆఫీసు ఎదురుగా, ప్రెస్ క్లబ్ ప్రక్కన ఒక రోజు దీక్ష నిర్వహస్తున్నామని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్బంగా నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని ఈ సంక్షోభానికి బతుకమ్మ చీరల బకాయిలు ఇవ్వకపోవడం, కరెంటు పై సబ్సిడీ ఎత్తేసి, కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో సిరిసిల్ల పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారని ఒకరోజు దీక్ష చేసి కార్మికుల ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఉద్దేశంతో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటుజాయింట్ కన్వీనర్ ఆడెపు రవీందర్, పత్తిపాక సురేష్, గౌడ వాసు, గుండెల్లి వేణు, కోడం ఆనంద్ బాబు, గాజుల సదానందం, ఊరకొండ రాజు, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >