Posted on 2024-07-19 18:33:49
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో జులై 20 శనివారం రోజున సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పరిస్థితులు తెలియజేయాలని సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో సెస్ ఆఫీసు ఎదురుగా, ప్రెస్ క్లబ్ ప్రక్కన ఒక రోజు దీక్ష నిర్వహస్తున్నామని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్బంగా నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని ఈ సంక్షోభానికి బతుకమ్మ చీరల బకాయిలు ఇవ్వకపోవడం, కరెంటు పై సబ్సిడీ ఎత్తేసి, కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో సిరిసిల్ల పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారని ఒకరోజు దీక్ష చేసి కార్మికుల ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఉద్దేశంతో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటుజాయింట్ కన్వీనర్ ఆడెపు రవీందర్, పత్తిపాక సురేష్, గౌడ వాసు, గుండెల్లి వేణు, కోడం ఆనంద్ బాబు, గాజుల సదానందం, ఊరకొండ రాజు, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >