| Daily భారత్
Logo




బంధువులు దుష్ప్రచారం చేస్తున్నారని దంపతుల ఆత్మహత్య

News

Posted on 2024-07-16 09:44:31

Share: Share


బంధువులు దుష్ప్రచారం చేస్తున్నారని దంపతుల ఆత్మహత్య

డైలీ భారత్, నిజామాబాద్ : బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

అంతకుముందు తమ ఆవేదన తెలియజేస్తూ వీడియో తీసి పోలీసులకు పంపించారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం..

పొతంగల్‌ మండలం హెగ్డోలికి చెందిన అనిల్‌ (28), పొతంగల్‌కు చెందిన శైలజ (24)కు ఏడాది కిందట వివాహమైంది. వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపారు. ఆయన నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌కు వీడియోతోపాటు వారి సెల్‌ఫోన్‌ నంబరు పంపారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించగా కనిపించలేదు. బాధితుల ఫోన్‌ నంబరును ట్రాక్‌ చేయగా ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్సై గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు.

Image 1

ఉగాది కవి సమ్మేళనం కవితలు పంపండి

Posted On 2026-03-08 11:57:45

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-03-08 11:17:27

Readmore >
Image 1

ముగ్గురు కూతుళ్లను హతమార్చిన కసాయి తండ్రి

Posted On 2026-03-08 09:16:57

Readmore >
Image 1

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

Posted On 2026-03-08 08:40:36

Readmore >
Image 1

సగానికి పైగా రేట్లు తగ్గిన కోడి గుడ్లు...

Posted On 2026-03-08 08:39:29

Readmore >
Image 1

వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్

Posted On 2026-03-08 08:38:31

Readmore >
Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >
Image 1

చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Posted On 2026-03-07 21:29:26

Readmore >
Image 1

బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

Posted On 2026-03-07 21:28:26

Readmore >