Posted on 2024-07-12 11:15:38
డైలీ భారత్, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వేస్టేషన్ దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పోలీసులు ప్రశ్నించారు. సమాధానం చెప్పని ఆ ముగ్గురు దుండగులు క్షణాల్లోనే పోలీసులపై మెరుపు దాడికి యత్నించి పారిపోవాలని చూశారు.
కాల్పులు ఎందుకు..?
ఒకరు గొడ్డలితో.. మరో ఇద్దరు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. ఈ కాల్పులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..!. కాగా.. పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారు. పోలీసుల కాల్పుల్లో ఒకరికి గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురినీ దోపిడీ దొంగల ముఠాగా పోలీస్ డెకాయ్ టీమ్ అనుమానిస్తోంది.
మేమున్నాం..!
ఇదిలా ఉంటే.. ఇటీవలే హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దగ్గర మరోసారి కాల్పులు జరిగాయి. ఈ వరుస ఘటనలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే.. శాంతి భద్రతలు, రక్షణ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని.. నగరవాసులు ప్రశాంతంగా ఉండొచ్చని పోలీసులు అభయమిస్తున్నారు..
#nampally railway station
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >