| Daily భారత్
Logo




హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం... ఉలిక్కిపడ్డ నగరవాసులు

News

Posted on 2024-07-12 11:15:38

Share: Share


హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం... ఉలిక్కిపడ్డ నగరవాసులు

డైలీ భారత్, హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వేస్టేషన్ దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పోలీసులు ప్రశ్నించారు. సమాధానం చెప్పని ఆ ముగ్గురు దుండగులు క్షణాల్లోనే పోలీసులపై మెరుపు దాడికి యత్నించి పారిపోవాలని చూశారు.

కాల్పులు ఎందుకు..?

ఒకరు గొడ్డలితో.. మరో ఇద్దరు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. ఈ కాల్పులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..!. కాగా.. పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారు. పోలీసుల కాల్పుల్లో ఒకరికి గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురినీ దోపిడీ దొంగల ముఠాగా పోలీస్ డెకాయ్ టీమ్ అనుమానిస్తోంది.

మేమున్నాం..!

ఇదిలా ఉంటే.. ఇటీవలే హైదరాబాద్‌ శివారులో దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దగ్గర మరోసారి కాల్పులు జరిగాయి. ఈ వరుస ఘటనలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే.. శాంతి భద్రతలు, రక్షణ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని.. నగరవాసులు ప్రశాంతంగా ఉండొచ్చని పోలీసులు అభయమిస్తున్నారు..


#nampally railway station

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >