Posted on 2024-07-11 11:53:30
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని మూడవ పోలీస్ స్టేష న్ పరిధిలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు తాళ లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
మూడవ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ కు చెందిన లావణ్య (23)కు వెంకటేష్ అనే వ్యక్తితో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగిందని తెలిసింది.
ఈ క్రమంలో కొద్ది రోజులకే భర్త అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించారని తెలియజేశారు. ఇదే క్రమంలో ఆషాడ మాసం ఉండడంతో సుభాష్ నగర్ లో ఉంటున్న తన పుట్టిం టికి వెళ్లలేక అత్తింటి వేధిం పులు తాళలేక మంగళ వారం రాత్రి సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది.
ఆది గమనించిన లావణ్య కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చి కిత్స పొందుతూ..ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు..
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >