Posted on 2024-07-10 19:17:27
వట్టెం నవోదయ పాఠశాలకు యువనేత మురళీకృష్ణ యాదవ్ సేవలు..
తన సోదరి జ్యోతి స్మారకార్థం స్వాగత తోరణం..
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: అది తనను అక్కున చేర్చుకొని అక్షరం నేర్పిన బడి.. తన మేధస్సు పెంచిన అమ్మ ఒడి.. విద్యా ప్రగతి వైపు తనను నడిపించిన గుడి.. అలాంటి బడికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు, బీఆర్ఎస్ యువనేత మురళీకృష్ణ యాదవ్. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని పాలెం పరిధిలోగల వట్టెం నవోదయ పాఠశాలలో రూ. 10 లక్షలు వెచ్చించి స్వాగత తోరణాన్ని నిర్మించారు. తమ సోదరి జ్యోతి జ్ఞాపకార్థం ఈ సత్కార్యానికి ఆయన శ్రీకారం పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అక్షరాలు నేర్పిన పాఠశాలకు భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థుల శ్రేయస్సు లక్ష్యంగా గతంలోనూ పలు సేవలు అందించారు యువనేత మురళీ యాదవ్. షాద్ నగర్ పరిధిలో పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ తరగతులు ఏర్పాటు చేయడం తో పాటు పలు పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ఆర్థికంగా సహకరించారు. ఇలాంటి లాభాపేక్ష లేకుండా లక్షల రూపాయలు వెచ్చించి ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించడం సర్వత్ర ప్రశంసలు అందుకుంటుంది..
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >