| Daily భారత్
Logo




కవియిత్రి మొల్ల స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-10 19:16:13

Share: Share


కవియిత్రి మొల్ల స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ లో "కవయిత్రి మొల్ల" విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శంకర్

షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల బోనాలు

301 కలశాలతో తొలి ఆశాడ బోనాన్ని పోచమ్మకు సమర్పించిన కుమ్మరి సంఘం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముగ్దులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల ఆమె స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం కావాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంచనంగా ఆవిష్కరించారు. షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు నడికూడ జయంతత్ రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, స్థానిక అధ్యక్షులు కుమ్మరి శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ యువనేత రాయికల్ శ్రీనివాస్ 

తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రసంగించారు. మొల్ల  రాసిన రామాయణం ‘మొల్ల రామాయణం’గా ఎంతో ప్రసిద్ధి చెందిందనీ, రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిందన్నారు. మొల్ల అసలు పేరు మొల్లమాంబ అనీ, ఆమె 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అని వివరించారు. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించిందని మొల్ల శ్రీ కృష్ణదేవరాయల సమయంలోని వారని కూడా ప్రసిద్ది అని అన్నారు. ఇక మొల్ల రచనలను చదివినవారు మొల్ల రచనా శైలి చాలా సరళమైందని, రమణీయమైనదని అంటారనీ ఆమె గొప్పతనాన్ని ఎమ్మెల్యే శంకర్ అందరికీ వివరించారు.

సమాజంలో కుమ్మరుల పాత్ర ఎంతో గొప్పదని వారు లేని సమాజాన్ని ఊహించుకోలెమని శంకర్ అభినందించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం సందర్భంగా 301 కలశాలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. మొదటి బోనాన్ని పోచమ్మ దేవతకు సమర్పించినట్టు యువనేత రాయికల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోనాన్ని ఎమ్మెల్యే శంకర్ స్వయంగా నెత్తిన ఎత్తుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడికూడ జయంతత్ రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్ స్థానిక అధ్యక్షులు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి రాయికల్ శ్రీనివాస్ 

పెంజర్ల రమేష్ శ్రీశైలం సాయిలు అంజయ్య బ్రహ్మయ్య వెంకటేష్ కృష్ణ విట్యాల అంజయ్య కోమాల్ నర్సింలు శంకరయ్య లింగం యాదయ్య జంగయ్య బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >