Posted on 2024-07-10 17:40:22
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకులో సభ్యత్వం నుండి వివిధ కారణాలతో ఇటీవల కాలంలో చనిపోయిన వారి కుటుంబాలకు భీమా చెక్కులను చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కొండూరు మాట్లాడుతూ . . .
ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో చనిపోయిన ఐదుగురు సభ్యులకు ఇన్సూరెన్స్ కు సంబంధించిన చెక్కులను అందజేస్తున్నామన్నారు ఇంటి పెద్దదిక్కులు కోల్పోయిన వారికి ఉడతా భక్తి సాయంగా ఈ డబ్బులు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరాలని, అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగినట్లయితే, కుటుంబానికి ఆసరా అవుతుందని కోరుతున్నామన్నారు. బ్యాంక్ ఖాతాదారులకు తాము చేయగలగినంత చిన్న చిన్న సహాయం చేసి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొండూరి రవీందర్ రావు, కెడిసిసి చైర్మన్, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్లు ఏనుగు తిరుపతిరెడ్డి, దేవదాసు లు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >