| Daily భారత్
Logo




ముజ్రా పార్టీలపై పోలీసుల దాడులు

News

Posted on 2024-07-09 19:21:55

Share: Share


ముజ్రా పార్టీలపై పోలీసుల దాడులు

ఫామ్ హౌస్‌లో రెచ్చిపోయిన ఢిల్లీ అమ్మాయిలు..

ముజ్రా పార్టీలపై పోలీసుల దాడులు.

డైలీ భారత్, రంగారెడ్డి: మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల నిర్మూలన, రేవ్ పార్టీలు, వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా తప్పుడు పనులు చేసే వారు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్, ఈ-సిగరెట్స్, గంజాయి వంటివి సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు టీ న్యాబ్ సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లోనూ ఇటీవల డ్రగ్స్ తీసుకుని యువత పట్టుపడుతున్నారు. ఇందులో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ట్ పెద్దఎత్తున ఉంటున్నారు. ప్రభుత్వం మరింత దృష్టిపెట్టి గంజాయి, డ్రగ్స్, రేవ్, ముజ్రా పార్టీలపై ఉక్కుపాదం మోపాలని పలవురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..

Image 1

₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

Posted On 2026-03-06 07:54:12

Readmore >
Image 1

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

Posted On 2026-03-06 07:46:55

Readmore >
Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >