Posted on 2024-04-29 20:12:54
వంశీ చంద్ గెలుపు - అభివృద్ధికి మలుపు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి ఫరూక్నగర్ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి , మహమ్మద్ ఇబ్రహీం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో షాద్నగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని షాద్నగర్ శాసనసభ్యులు శంకర్ సూచించారు సోమవారం షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కోనాయిపల్లి గ్రామంలో కేశంపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వీరేశం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం జోరుగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు 6 గ్యారంటీ పథకాలను అందిస్తున్నామన్నారు .కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్ల వంశీ చందు రెడ్డి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ బిజెపి నాయకులు వచ్చి ఏవో మాయమాటలు చెప్పితే ప్రజలు నమ్మొద్దని అన్నారు . ప్రజల అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీ చందు రెడ్డి గెలిపించాలని కోరారు .ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి సురేష్ రెడ్డి భాస్కర్ మధుసూదన్ రెడ్డి వెంకటేష్ గౌడ్ నరసింహారెడ్డి సురేష్ మీరే చెప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు 4కోట్ల బిడ్డల భావోద్వేగం : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-09 22:42:20
Readmore >
2047 నాటికి చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్గా తెలంగాణ : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2025-12-09 22:40:23
Readmore >
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే : ఏపీ సీఎం చంద్రబాబు
Posted On 2025-12-09 22:39:02
Readmore >
గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి విడత నిర్వహణలో భాగంగా బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి
Posted On 2025-12-09 18:52:36
Readmore >