Posted on 2025-12-09 18:52:36
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలు బోధన్ డివిజన్ పరిదిలో జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య బోధన్ సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ప్రధానంగా
బోధన్ డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన, అతిసమస్యత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు (విపిఓ)ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించిన పోలింగ్ బూతు వద్ద సక్రమమైన విధులు నిర్వహించాలని , ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీ.ఐ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ, నిజామాబాద్ నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి . శ్రీనివాస్, రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి , ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, కోటగిరి ఎస్సై సునిల్, వర్ని ఎస్సై ఎస్.రాజు, రుద్రూర్ ఎస్సై సాయన్న తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >