Posted on 2024-04-16 10:39:11
డైలీ భారత్, జమ్ము కాశ్మీర్: జమ్ముకశ్మీర్లోని జీలం నదిలో విద్యార్థులు కూలీలు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అధి కారులు గుర్తించారు.
గుండ్బాల్ బట్వారా ప్రాంతంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గల్లంతైన వారి మృతదేహాల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
మరో వైపు కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది ఉధృతంగా ప్రవహిస్తుం డడంతో సాధారణ జనజీవనం స్తంభించి పోయింది.
అయితే గుండ్బాల్ను శ్రీనగర్ను కలిపే బ్రిడ్జి గత దశాబ్ద కాలంగా నిర్మాణంలో ఉందని, దీంతో స్థానిక ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు వాపోతున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >