| Daily భారత్
Logo




ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

News

Posted on 2024-02-28 07:15:55

Share: Share


ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

ఆర్థికంగా పీడించొద్దు .. మెరుగైన వైద్యాన్ని అందించండి

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారని వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు బుధవారం పట్టణంలోని పరిగి రోడ్డులో ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాక్ ను ఎమ్మెల్యే శంకర్ మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక మహిళా కౌన్సిలర్ శ్రావణితో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఏబీవీ ఆసుపత్రి దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలని అన్నారు. పేద ప్రజలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పేర్కొన్నారు. మంచి సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన వైద్యంతో వారికి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. నేటి సమాజంలో ప్రైవేటు వైద్యం అందనీ ద్రాక్షగా మారుతోందని అందుకే ప్రైవేట్ సంస్థలు పేద ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించాలని సూచించారు. వ్యవస్థలో ఎవరు ఎన్ని సేవలు చేసిన ఏ రంగాల వారైనా సరే పేదల వైద్యం కోసం ఎప్పుడైనా సిఫార్సు చేస్తారని వారి సిఫార్సులను దృష్టిలో పెట్టుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు సూచించారు. వైద్య సేవల్లో మంచిని స్వీకరిస్తామని చెడును స్వీకరించబోమని దానికి అనుగుణంగానే ప్రైవేట్ ఆస్పత్రులు ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. రెండవ బ్లాక్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శ్యాంసుందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రావణిలకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇధ్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నేతలు అందే మోహన్ సయ్యద్ ఖదీర్ సింగారం సుదర్శన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Image 1

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి

Posted On 2026-07-18 10:24:15

Readmore >
Image 1

24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!

Posted On 2026-07-18 10:20:51

Readmore >
Image 1

ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు

Posted On 2026-07-18 06:17:55

Readmore >
Image 1

రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు

Posted On 2026-07-18 06:16:11

Readmore >
Image 1

జిల్లాలో నరసన్న పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Posted On 2026-07-18 06:13:42

Readmore >
Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >