| Daily భారత్
Logo




ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

News

Posted on 2024-02-28 11:45:55

Share: Share


ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

ఆర్థికంగా పీడించొద్దు .. మెరుగైన వైద్యాన్ని అందించండి

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారని వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు బుధవారం పట్టణంలోని పరిగి రోడ్డులో ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాక్ ను ఎమ్మెల్యే శంకర్ మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక మహిళా కౌన్సిలర్ శ్రావణితో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఏబీవీ ఆసుపత్రి దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలని అన్నారు. పేద ప్రజలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పేర్కొన్నారు. మంచి సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన వైద్యంతో వారికి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. నేటి సమాజంలో ప్రైవేటు వైద్యం అందనీ ద్రాక్షగా మారుతోందని అందుకే ప్రైవేట్ సంస్థలు పేద ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించాలని సూచించారు. వ్యవస్థలో ఎవరు ఎన్ని సేవలు చేసిన ఏ రంగాల వారైనా సరే పేదల వైద్యం కోసం ఎప్పుడైనా సిఫార్సు చేస్తారని వారి సిఫార్సులను దృష్టిలో పెట్టుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు సూచించారు. వైద్య సేవల్లో మంచిని స్వీకరిస్తామని చెడును స్వీకరించబోమని దానికి అనుగుణంగానే ప్రైవేట్ ఆస్పత్రులు ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. రెండవ బ్లాక్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శ్యాంసుందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రావణిలకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇధ్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నేతలు అందే మోహన్ సయ్యద్ ఖదీర్ సింగారం సుదర్శన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >
Image 1

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

Posted On 2026-03-13 17:33:46

Readmore >
Image 1

కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

Posted On 2026-03-13 16:46:49

Readmore >
Image 1

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-13 16:41:37

Readmore >
Image 1

అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

Posted On 2026-03-13 16:39:38

Readmore >