| Daily భారత్
Logo




ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

News

Posted on 2024-02-28 11:45:55

Share: Share


ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

ఆర్థికంగా పీడించొద్దు .. మెరుగైన వైద్యాన్ని అందించండి

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారని వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు బుధవారం పట్టణంలోని పరిగి రోడ్డులో ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాక్ ను ఎమ్మెల్యే శంకర్ మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక మహిళా కౌన్సిలర్ శ్రావణితో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఏబీవీ ఆసుపత్రి దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలని అన్నారు. పేద ప్రజలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పేర్కొన్నారు. మంచి సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన వైద్యంతో వారికి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. నేటి సమాజంలో ప్రైవేటు వైద్యం అందనీ ద్రాక్షగా మారుతోందని అందుకే ప్రైవేట్ సంస్థలు పేద ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించాలని సూచించారు. వ్యవస్థలో ఎవరు ఎన్ని సేవలు చేసిన ఏ రంగాల వారైనా సరే పేదల వైద్యం కోసం ఎప్పుడైనా సిఫార్సు చేస్తారని వారి సిఫార్సులను దృష్టిలో పెట్టుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు సూచించారు. వైద్య సేవల్లో మంచిని స్వీకరిస్తామని చెడును స్వీకరించబోమని దానికి అనుగుణంగానే ప్రైవేట్ ఆస్పత్రులు ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. రెండవ బ్లాక్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శ్యాంసుందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రావణిలకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇధ్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నేతలు అందే మోహన్ సయ్యద్ ఖదీర్ సింగారం సుదర్శన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >