Posted on 2026-06-22 18:54:32
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ (Dy. DM&HO) డాక్టర్ పవిత్ర సందర్శించి కేంద్రంలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాతా -శిశు సంక్షేమ (MCH) సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వ్యాధి నియంత్రణ చర్యలు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల పురోగతిని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులు, నివేదికలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వాటి నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, రోగులకు అందిస్తున్న సేవల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్శనలో వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >
వైరా నియోజకవర్గం : కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Posted On 2026-06-22 19:48:03
Readmore >
చెన్నై ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారం : భార్య అమర్చిన రహస్య CCTVలో భర్త
Posted On 2026-06-22 19:44:31
Readmore >
నేరెళ్ల పీహెచ్సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >