Posted on 2026-06-14 09:37:39
డైలీ భారత్, స్పెషల్:
తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం...
గోవిందా గోవిందా నినాదాల గగనంలో
గిరులు కూడా తలవంచిన ఆ మహా సన్నిధిలో
శ్రీవారి కృపా కటాక్షం తాకిన వేళ...
జీవితమే కొత్త వెలుగుల దీపమై మారెను…!
మంజుల కలం నుంచి జారిన ప్రతి అక్షరం
పూల మాలలా మారి పాదాల వద్ద చేరెను
అవి భక్తి గీతాలై లోకమంతా విరిసెను
హృదయాలను తాకే అమృత ధారలై ప్రవహించెను..!
శ్రీనివాసా… నీ నామం పలికిన చోట
మాటలు మౌనమై ప్రార్థనగా మారిపోతాయి
దుఃఖం కూడా దారిచూపే దీపమవుతుంది
మనసు తననే తాను మరిచిపోయే క్షణమవుతుంది..!
అక్కడ వెలిగే దీపం నూనెతో కాదు
మనిషి లోపల కరిగే అహంతో వెలుగుతుంది..!
మంజుల కలం నుంచి వచ్చిన అక్షరాలు
అది అక్షరాలుగా కాదు—ఆర్తిగా ప్రవహిస్తుంది
ప్రతి పదం ఒక పుష్పమై పాదాల వద్ద వాలుతుంది
ప్రతి వాక్యం ఒక నిశ్శబ్ద ప్రదక్షిణగా తిరుగుతుంది..!
తిరుమల శిఖర సింహాసనంపై విరాజిల్లే స్వామీ
నీ పాదస్పర్శ లభిస్తే మా జన్మ ధన్యమవుతుంది..!
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >