| Daily భారత్
Logo




ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

News

Posted on 2026-06-04 20:11:41

Share: Share


ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో కామారెడ్డి జిల్లా పోలీసులు “Arrive Alive – క్షేమంగా ఇంటికి చేరండి” కార్యక్రమం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడవచ్చని సూచిస్తున్నారు.

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని ప్రజలకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ, “గమ్యానికి చేరుకోవడం కంటే క్షేమంగా చేరుకోవడమే ముఖ్యం. మీ కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రయాణించాలి” అని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొంటూ, సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Image 1

భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు

Posted On 2026-06-04 20:12:57

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-04 20:11:41

Readmore >
Image 1

దారుణం.. భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త

Posted On 2026-06-04 19:02:54

Readmore >
Image 1

రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం

Posted On 2026-06-04 18:52:18

Readmore >
Image 1

విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-04 18:50:58

Readmore >
Image 1

బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ

Posted On 2026-06-04 18:49:52

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్..

Posted On 2026-06-04 16:10:32

Readmore >
Image 1

హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం..

Posted On 2026-06-04 16:02:10

Readmore >
Image 1

కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం

Posted On 2026-06-04 15:58:25

Readmore >
Image 1

ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు

Posted On 2026-06-04 15:52:23

Readmore >