Posted on 2026-06-04 19:02:54
డైలీ భారత్, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఖైతలాపూర్లోని డబుల్ బెడ్ రూమ్స్ ప్రాంతంలో ఓ భర్త తన భార్యను దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. వివరాళ్లోకేళితే.. రహీమ్, సుమేరా దంపతులకు 2024లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. వృత్తిరీత్యా రహీమ్ ఆటో డ్రైవర్. రహీమ్కు, అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున కూడా దంపతులిరువురి మధ్య గొడవ జరిగింది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన రహీమ్.. భార్య సుమేరా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపైన కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >
కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం
Posted On 2026-06-04 15:58:25
Readmore >
ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు
Posted On 2026-06-04 15:52:23
Readmore >