Posted on 2026-06-04 15:20:58
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదును గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు (MEOs), కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రవేశాల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. డ్రాప్అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రవేశాల ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ NV గిరి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...
Posted On 2026-07-25 04:00:34
Readmore >
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >