Posted on 2026-06-03 21:22:43
చందుర్తి మండలంలో దారుణ ఘటన
మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం
కేసు నమోదు చేసిన ఎస్ఐ జిల్లెల రమేష్
డైలీ భారత్, చందుర్తి: చందుర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అర్థరాత్రి ఇంటికి వచ్చి బెదిరించి తీసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం..బాధితురాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె 14 ఏళ్ల కుమార్తెకు, మానాల గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు గత కొంతకాలంగా ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. నిరంతరం కాల్ చేస్తూ, పెళ్లి చేసుకోవాలని సదరు బాలుడు బాలికపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి 11:40 గంటల సమయంలో, బాధితురాలు తన కుమార్తె మరియు తల్లితో కలిసి నిద్రిస్తుండగా, నిందితుడు మరో బాలుడితో కలిసి ఇంటికి వచ్చాడు. ఫోన్ చేసి బయటకు రాకపోతే చంపేస్తామని బెదిరించడంతో, భయపడిన బాలిక ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లింది.నిందితులు ఆమెను సమీపంలోని ఒక గుడిసె వద్దకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం నల్లటి హోండా యాక్టివా వాహనంపై అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు...
ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్
Posted On 2026-06-03 22:09:33
Readmore >
వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-06-03 21:25:37
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం
Posted On 2026-06-03 21:22:43
Readmore >
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-03 21:11:18
Readmore >
సిరిసిల్లలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం
Posted On 2026-06-03 20:05:43
Readmore >
వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి
Posted On 2026-06-03 20:01:51
Readmore >
జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు
Posted On 2026-06-03 20:00:43
Readmore >