Posted on 2026-05-05 09:36:31
ఎన్ జి ఓ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అందజేత
ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
డైలీ భారత్, కామారెడ్డి: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర అధ్యక్షులు,సమాజ సేవకులు, తెలంగాణ టూరిజం కార్పోరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా ఎన్ జి ఓ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం స్టీల్ వాటర్ ట్యాంక్ ను మరియు శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 8 వేల మందికి తాళి బొట్లను అందజేసిన గొప్ప సామాజిక సేవకులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అని, ఆర్యవైశ్యుల ఐక్యత కోసం రాజకీయంగా సామాజిక ఎదుగుదల కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శప్రాయలుగా నిలవడం జరిగిందని,ఇలాంటి సామాజిక సేవలు మరిన్ని కొనసాగించాలని కోరుకున్నారు.ఐవిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకటేష్,ఆధ్యాత్మిక విభాగం జిల్లా అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, ఉపాధ్యక్షులు రాజూరి మనోహర్,కొత్త భీమ్ రాజ్,పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,రజిత ఐవిఎఫ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >