Posted on 2026-05-05 09:20:37
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ పరిధిలో ఇందిరమ్మ చీరెలను స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత పంపిణీ చేశారు. NGOS కాలనీ ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో 14వార్డ్ మహిళలకు, డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మూడు రోజుల పాటు 14వ వార్డ్ మహిళలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణహరి, కాంగ్రెస్ నాయకులు మీసాల గంగారాం, మెహెర్ బాబా గౌడ్, కృష్ణ రెడ్డి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >