Posted on 2026-04-14 14:43:54
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారత రాజ్యాంగ నిర్మాత,మహా మేధావి,సామాజిక న్యాయ సాధకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన టీడీపీ వేములవాడ అడాహాక్ కమిటీ సభ్యులు,టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమానత్వం,న్యాయం,స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని,ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు,రక్షణ,గౌరవాన్ని కల్పించే శాశ్వత దారిదీపంగా నిలిచిందని, “విద్య పొందండి –సంఘటితమవండి –పోరాడండి” అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం అని తెలిపారు.
సమాజంలో సమానత్వం,సోదరభావం,న్యాయం నెలకొల్పడమే అంబేద్కర్ గారి లక్ష్యం అని,ఆ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని మోతె రాజిరెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ పాల్గొన్నారు.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >