Posted on 2026-04-13 17:15:38
ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలింపు
డైలీ భారత్, మహబూబాబాద్/కొత్తగూడ : ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో తీవ్రంగా గాయపడిన ఘటన కొత్తగూడ మండలం మాసంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.మాసంపల్లి గ్రామానికి చెందిన లావుడ్య వాగా కుమార్తె లావుడ్య కావ్యశ్రీ (9) సోమవారం తన ఇంటి మేడ (స్లాబ్) పై ఆడుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి పైభాగం నుండి వెళ్తున్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలను బాలిక గమనించకుండా పట్టుకుంది.విద్యుత్ తీగలు తాకగానే బాలికకు తీవ్రంగా షాక్ కొట్టింది.
షాక్ ప్రభావంతో బాలిక స్లాబ్ పై నుండి ఒక్కసారిగా కిందపడిపోయింది.
దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్ గోవర్ధన్, ఈఎంటి (EMT) రాంబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, మెరుగైన వైద్యం కోసం అత్యంత వేగంగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి త్వరగా కోలుకోవాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >