Posted on 2026-04-03 05:24:24
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాతల్లాడ మండలంలోని నారాయణపురం రామ భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నారాయణపురంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాలను చేతపట్టుకుని పాదయాత్రగా బయలుదేరి తరలి వెళ్లారు. సుమారు 8 మంది పాదయాత్రగా రాముల వారి గేయాలను ఆలపిస్తూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు పండాలని స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ భక్తులుజీడిమళ్ళ కిషోర్ రెడ్డి, రెడ్ ఎం రామకృష్ణారెడ్డి. రెడ్ యం రామిరెడ్డి.రెడ్డి ఆదినారాయణ .ఎర్రమల నాగార్జున రెడ్డీ.ఎర్రమల సైదిరెడ్డి. జీడిమల్ల కౌశిక్ రెడ్డిఇతర భక్తులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >