Posted on 2026-03-24 19:38:13
రోడ్డుకు అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగించిన ఆర్టీసీ డ్రైవర్
డైలీ భారత్, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రాయికల్ వెళ్ళే దారిలో మాదాపూర్, పైడిమడుగు, జోగినిపెల్లి, మైతాపూర్,వద్ద చెట్ల కొమ్మలు రోడ్డు పైకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాయి.
రెండు బస్ లు ఎదురుపడ్డపుడు వెళ్ళడానికి వీలు లేకుండా సైడు తీసుకుంటుంటే, కొమ్మలు తగిలి అద్దాలు పగిలిపోతున్నాయి. అయినా అధికారులు, స్థానిక నాయకులు పట్టించుకోక పోవడంతో రోడ్డుకు అడ్డంగా పెరిగి వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తున్న చెట్టు కొమ్మలను ఆర్టీసీ డ్రైవర్ తిరుపతి స్వయంగా కత్తితో కొట్టి తొలగించాడు.
ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చాలాకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ సంబంధిత అధికారులకు, నాయకులకు చెప్పిన చర్యలు తీసుకోక పోవడంతో డ్రైవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొమ్మలను తొలగించడం అవసరమని భావించి ఇలా చేశాడని స్థానికులు చెబుతున్నారు.
డ్రైవర్ చర్యను కొందరు అభినందిస్తుండగా, మరికొందరు విధుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >