Posted on 2026-03-23 17:03:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ మరియు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల వర్ధంతిని పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ, యువత డ్రగ్స్ మరియు మద్యానికి బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. అలవాట్లు వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం మరియు సమాజానికి కూడా నష్టం కలిగిస్తాయని ఆమె హెచ్చరించారు.
యువత మంచి మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, దేశభక్తుల త్యాగాలను స్మరించుకోవడం అంటే వారి ఆలోచనలను ఆచరణలో పెట్టడమేనని ఆమె తెలిపారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వీర్ల రమేష్ మరియు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు మరియు కార్యకర్తలకు సమాజంలో డ్రగ్స్ మరియు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.మద్యం మరియు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఏఎస్ఐ శివాజీ గణేష్ తదితరులు పాల్గొన్నారు
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >
పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు
Posted On 2026-03-27 08:53:44
Readmore >
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >