Posted on 2026-03-23 22:33:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ మరియు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల వర్ధంతిని పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ, యువత డ్రగ్స్ మరియు మద్యానికి బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. అలవాట్లు వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం మరియు సమాజానికి కూడా నష్టం కలిగిస్తాయని ఆమె హెచ్చరించారు.
యువత మంచి మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, దేశభక్తుల త్యాగాలను స్మరించుకోవడం అంటే వారి ఆలోచనలను ఆచరణలో పెట్టడమేనని ఆమె తెలిపారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వీర్ల రమేష్ మరియు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు మరియు కార్యకర్తలకు సమాజంలో డ్రగ్స్ మరియు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.మద్యం మరియు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఏఎస్ఐ శివాజీ గణేష్ తదితరులు పాల్గొన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >