Posted on 2026-03-23 12:59:57
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
డైలీ భారత్, వైరా: నేటి తరానికి స్ఫూర్తిని అందించిన నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్ అని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. సోమవారం భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడిపూడి భవనంలో జరిగిన కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భూక్యా వీరభద్రం మాట్లాడుతూ నాటి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి బ్రిటిష్ పార్లమెంట్లో బాంబు వేసి భారత స్వాతంత్రం కోసం నవ యవ్వన వయస్సులో ఉరితాడుకు పెనవేసుకుపోయిన భగత్ సింగ్ జీవితం తరతరాలకు ఆదర్శం అని అన్నారు. నేడు అమెరికా సామ్రాజ్యవాదం అహంకారంతో ఇరాన్ పై దాడులు చేస్తుందని అన్నారు. ప్రపంచ సంపద, ఆయిల్ పై ఆధిపత్యం, అక్రమ సంపాదన కోసం ప్రపంచ దేశాలను ఆక్రమించుకొని ఆధిపత్యాన్ని చలాయించాలని అమెరికా యుద్ధాలు చేస్తున్నదని విమర్శించారు. అయినా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పక పోవడం దుర్మార్గమన్నారు. దీనిని భారత ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలు అర్థం చేసుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాన్ని తీవ్రంగా ఖండించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంకర సుధాకర్, పట్టణ నాయకులు కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, మల్లెంపాటి రామారావు, పానుగంటి రాంబాబు, యనమద్ది రామకృష్ణ, మాడపాటి మల్లికార్జున్ రావు, బెజవాడ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >