Posted on 2026-03-23 02:56:49
ఊరేగింపులో భారీగా పాల్గొన్న గ్రామస్తులు
అగ్ని పునీతం చేసి తమ భక్తి ని విశ్వాసాన్ని చాటిన ఆదివాసీలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుఆదివాసి నాయక పోడుల కుల దేవత పెద్దమ్మతల్లి కొలుపు కార్యక్రమాన్ని మండల పరిధి పడమట నర్సాపురం గ్రామంలో అత్యంత భక్తి శ్రద్దలతోటి నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు సాగిన పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమం ఆదివారం కొండాలు తొక్కుటతో ముగిసింది. శనివారం సాయంత్రం భారీ భక్త జన సందోహం నడుమ గ్రామ ప్రధాన వీధులలో సరువుల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి ఆదివాసి నాయక పోడు కుల పూజారులు తమ సంస్కృతి, సాంప్రదాయ, ఆచారాలతో గణాసారులు, దేవర బాలల ఆధ్వర్యంలో పట్నాలు ఏసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం పోతురాజు శిరస్సును జలధిలో కలిపి స్నానాలను ఆచరించిన అనంతరం రాజుకి పెద్దమ్మ తల్లికి గ్రామ పేరంటాల నడుమ లేళ్ళ సత్యనారాయణ రెడ్డి, కమలమ్మ దంపతుల కుమారులు లేళ్ళ అప్పిరెడ్డి, నాగిరెడ్డి దంపతులచే అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం రాజు, పెద్దమ్మతల్లి, పోతురాజు, బోనాలతో పూజారులు, గణ బాలలు, దేవర బాలలు, యువకులు, మహిళలు (కొండాలు తొక్కి) అగ్నిగుండంలోనీ నిప్పులపై నడచి, అగ్ని పునీతమై తమ దేవతలపై ఉన్న భక్తిని, నమ్మకాన్ని, తమ ఆచార సాంప్రదాయాలను చాటారు. ఇలా కొలుపు చేయడం ద్వారా గ్రామంలోనీ ప్రజలు, పశువులు, పంటలు వృద్ధి చెంది సుభిక్షంగా ఉండటంతో పాటు, అంటువ్యాధుల భారి నుండి అతివృష్టి అనావృష్టి నుండి ఆ తల్లి కాపాడుతుందని, ప్రతి పనిలో విజయం సాధిస్తామని ఆదివాసీల నమ్మకం. ఆదివారం కొలుపు ముగింపు అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్దమ్మ తల్లి కొలుపు అనంతరం గ్రామస్తులతోపాటు, ఇతర గ్రామాల భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతోపాటు, పరిసర, సుదూర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >