Posted on 2026-03-03 11:24:11
డైలీ భారత్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓతల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్, ఐశ్వర్య దంపతులు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లల సంతానం.అయితే కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఐశ్వర్య, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి అత్తారింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య చంపేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ముగ్గురు మృతిచెండంతో గొల్లగూడె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి
ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
Posted On 2026-03-04 06:20:57
Readmore >