| Daily భారత్
Logo




ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

News

Posted on 2026-03-03 11:24:11

Share: Share


ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

డైలీ భారత్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓతల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్, ఐశ్వర్య దంపతులు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లల సంతానం.అయితే కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఐశ్వర్య, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి అత్తారింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య చంపేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ముగ్గురు మృతిచెండంతో గొల్లగూడె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి

Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 10:50:02

Readmore >
Image 1

ఐదుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

Posted On 2026-06-02 08:08:42

Readmore >