Posted on 2026-03-02 09:31:56
డైలీ భారత్, సిరిసిల్ల: సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్స్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చేస్తున్న జాప్యానికి నిరసనగా 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే ఈశ్వర్ రావు, నలువాల స్వామి లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సెస్ ఎండికి ఐదుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెల ఇచ్చే ఎఫ్ టి ఏ గత ఎనిమిది మాసాల నుంచి ఆపివేశారని 2025 సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సిన యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను రెగ్యులరైజ్ చేయలేదని సెస్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమలు చేయడం లేదని వారు పేర్కొన్నారు ఏ హెచ్ లుగా పిలువబడే కార్మికులందరూ ఐటిఐ ఎలక్ట్రికల్ చేసిన వారేనని టెక్నికల్ గా చూస్తే వారందరూ టెక్నీషియన్సే నని సెస్ లో మాత్రం అసిస్టెంట్ హెల్పర్లు అని పిలవడం వలన కార్మికుల ఆత్మ గౌరవాన్ని అవమానించడమేనని వారు అన్నారు అసిస్టెంట్ హెల్పర్ అనే పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు ఇవ్వడం వంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని వారు వివరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 11 నుంచి ఈ నెల 14 వరకు 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు ఈ 72 గంటల్లో వివిధ రూపాల్లో నిరసనలు కూడా తెలియజేస్తామని ఇప్పటికైనా సెస్ చైర్మన్, సెస్ ఎం డి లు కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తో సంప్రదింపులు చేసి సమస్యలు పరిష్కరించాలని వారు పేర్కొన్నారు సమావేశంలో సెస్ కమిటీ అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం కోశాధికారి ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >