| Daily భారత్
Logo




సెస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యానికి నిరసనగా విధుల బహిష్కరణ

News

Posted on 2026-03-02 14:01:56

Share: Share


సెస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యానికి నిరసనగా విధుల బహిష్కరణ

డైలీ భారత్, సిరిసిల్ల: సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్స్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చేస్తున్న జాప్యానికి నిరసనగా 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే ఈశ్వర్ రావు, నలువాల స్వామి లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సెస్ ఎండికి ఐదుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెల ఇచ్చే ఎఫ్ టి ఏ గత ఎనిమిది మాసాల నుంచి ఆపివేశారని 2025 సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సిన యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను రెగ్యులరైజ్ చేయలేదని సెస్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమలు చేయడం లేదని వారు పేర్కొన్నారు ఏ హెచ్ లుగా పిలువబడే కార్మికులందరూ ఐటిఐ ఎలక్ట్రికల్ చేసిన వారేనని టెక్నికల్ గా చూస్తే వారందరూ టెక్నీషియన్సే నని సెస్ లో మాత్రం అసిస్టెంట్ హెల్పర్లు అని పిలవడం వలన కార్మికుల ఆత్మ గౌరవాన్ని అవమానించడమేనని వారు అన్నారు అసిస్టెంట్ హెల్పర్ అనే పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు ఇవ్వడం వంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని వారు వివరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 11 నుంచి ఈ నెల 14 వరకు 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు ఈ 72 గంటల్లో వివిధ రూపాల్లో నిరసనలు కూడా తెలియజేస్తామని ఇప్పటికైనా సెస్ చైర్మన్, సెస్ ఎం డి లు కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తో సంప్రదింపులు చేసి సమస్యలు పరిష్కరించాలని వారు పేర్కొన్నారు సమావేశంలో సెస్ కమిటీ అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం కోశాధికారి ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >
Image 1

జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

Posted On 2026-06-01 19:24:23

Readmore >
Image 1

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

Posted On 2026-06-01 19:22:34

Readmore >
Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >
Image 1

గంభీరావుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్

Posted On 2026-06-01 15:07:57

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-01 11:10:15

Readmore >
Image 1

జూన్ 2 – జనగర్జన ఫలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-01 10:36:22

Readmore >
Image 1

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Posted On 2026-06-01 10:32:06

Readmore >
Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >