Posted on 2026-02-28 16:03:01
డైలీ భారత్, కాకినాడ: ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
ఘటనా స్తలంలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాద స్థలంలో ఇంకొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇది స్తానికుల నుంచి అందిన ప్రాథమిక సమచారం. అయితే, మృతులు, క్షతగాత్రుల విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు పొలాల్లోకి ఎగిసిపడ్డాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో అక్కడ 20 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఇంకా పేలుడు కొనసాగుతోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ఘటన అని ప్రాథమిక అంచనా.
స్థానిక పెదపూడి రోడ్డులోని పొలాల్లో అడపా నాని కుటుంబ సభ్యులు ఒక బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అక్కడే ఉండటంతో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులోకి తేవడం కష్టంగా మారింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >