Posted on 2026-02-28 16:03:01
డైలీ భారత్, కాకినాడ: ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
ఘటనా స్తలంలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాద స్థలంలో ఇంకొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇది స్తానికుల నుంచి అందిన ప్రాథమిక సమచారం. అయితే, మృతులు, క్షతగాత్రుల విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు పొలాల్లోకి ఎగిసిపడ్డాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో అక్కడ 20 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఇంకా పేలుడు కొనసాగుతోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ఘటన అని ప్రాథమిక అంచనా.
స్థానిక పెదపూడి రోడ్డులోని పొలాల్లో అడపా నాని కుటుంబ సభ్యులు ఒక బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అక్కడే ఉండటంతో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులోకి తేవడం కష్టంగా మారింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు.
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >