Posted on 2026-02-20 05:25:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమన్నారు.పోలీస్ జాగిలం షైనీ కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లాల్ సింగ్,లైకా కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న కే.ముత్తయ్య,ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు,సిబ్బందికి ఈ సందర్బంగా ఎస్పీ పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 12 పోలీస్ జాగిలాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాగిలాల సంరక్షణ,వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
హైమాస్టర్ లైటింగ్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు
Posted On 2026-02-20 16:29:31
Readmore >
షాద్నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-02-20 14:22:43
Readmore >
స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!
Posted On 2026-02-20 08:57:22
Readmore >
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
Posted On 2026-02-20 06:09:15
Readmore >