Posted on 2026-02-04 09:21:47
డైలీ భారత్, మోయినాబాద్: ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే.. కనికరం లేకుండా సొంత చెల్లెలిని కత్తితో నరికి చంపిన ఘోర ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కలకలం రేపింది.
కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమెకు, ఆమె సోదరుడికి మధ్య ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం పొలం వద్ద ఆస్తి పంచాయితీ జరుగుతుండగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్న మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
స్థానికుల సమాచారంతో మొయినాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
తోటి న్యాయవాది హత్యకు గురవ్వడంతో చేవెళ్ల కోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >