| Daily భారత్
Logo




హైదరాబాద్ కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం..

News

Posted on 2026-01-31 11:16:58

Share: Share


హైదరాబాద్ కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం..

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.

నాంపల్లికి చెందిన వ్యాపారి రషీద్ ఉదయం 7 గంటలకు ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలో రూ.6లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు ఒక బ్యాగ్‌తో వచ్చాడు. రషీద్ డబ్బులతో రావడం గమనించిన కొందరు దుండగులు, అతని చేతిలోని బ్యాగును లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అది గమనించిన రషీద్ ప్రతిఘటించడంతో అతనిపై కాల్పులు జరిపి డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రషీద్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించాయని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ఘటనపై తమకు కాల్ వచ్చిందని.. వెంటనే అలర్ట్ అయ్యామని పేర్కొన్నారు. నిందితుల కోసం ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నిందితులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >