Posted on 2026-01-31 06:46:58
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.
నాంపల్లికి చెందిన వ్యాపారి రషీద్ ఉదయం 7 గంటలకు ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో రూ.6లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు ఒక బ్యాగ్తో వచ్చాడు. రషీద్ డబ్బులతో రావడం గమనించిన కొందరు దుండగులు, అతని చేతిలోని బ్యాగును లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అది గమనించిన రషీద్ ప్రతిఘటించడంతో అతనిపై కాల్పులు జరిపి డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రషీద్ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించాయని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ఘటనపై తమకు కాల్ వచ్చిందని.. వెంటనే అలర్ట్ అయ్యామని పేర్కొన్నారు. నిందితుల కోసం ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నిందితులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >