Posted on 2026-01-27 14:10:38
41 వ సారి రక్తదానం చేసిన రవికుమార్
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ శాఖని మీనా (28) అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో,వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్ మానవతా దృక్పథంతో స్పందించి 41 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రవికుమార్ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానంతో పాటుగా మూడు నుండి నాలుగు సార్లు తెల్ల రక్త కణాలను అందజేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నారని,ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్న రక్తదాత రవికుమార్ అభినందించడం జరిగింది. ఆపదలో ఉన్న వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని రక్త దానం చేయడానికి యువత ముందుకు రావాలని అన్నారు.
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >