| Daily భారత్
Logo




చెన్నారావుపేటలో బయటపడిన ఏవో దందా ?

News

Posted on 2026-01-10 18:08:46

Share: Share


చెన్నారావుపేటలో బయటపడిన ఏవో దందా ?

సోషల్ మీడియాలో వైరల్ అయిన అధికారి ఆడియో సంభాషణ

"క్షమించండి.. మళ్లీ జరగదు" అంటూ సర్పంచ్కు రిక్వెస్ట్

డైలీ భారత్, వరంగల్ జిల్లా:  చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామంలోయూరియా కొరత మధ్య అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏఓ) టోకెన్లను అక్రమంగా విక్రయించాడన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతులకు కేటాయించాల్సిన యూరియా టోకెన్లు దళారుల చేతుల్లో ప్రత్యక్షమవ్వడంతో అధికారుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల వద్ద రైతులు టోకెన్లు రాయించుకున్నప్పటికీ, జనవరి 6న పెద్ద సంఖ్యలో టోకెన్లు రైతులకు కాకుండా ఇతరులకు కేటాయించబడ్డాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏఈవో సంతకంతో పెద్ద మొత్తంలో టోకెన్లు వెలుగులోకి రావడం అనుమానాలకు తావిస్తోంది.

సర్పంచ్-ఏఓ ఆడియో వైరల్

ఈ అంశాన్ని రైతులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, సర్పంచ్ మండల ఏఓకు ఫోన్ చేసి వివరణ కోరారు. "రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? టోకెన్లు డబ్బులకు అమ్మారా?" అని ప్రశ్నించగా, ఏఓ తన తప్పును అంగీకరిస్తూ "నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి.. మళ్లీ రిపీట్ కాకుండా చూస్తాను, దండం పెడతా" అంటూ బ్రతిమాలినట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది.

అయితే, అధికారికంగా సర్పంచ్ వివరణ కోరినప్పుడు మాత్రం "టోకెన్లు ఎలా మిస్ అయ్యాయో తెలియదు" అంటూ ఏఓ చాకచక్యంగా తప్పించుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఏఓ. స్వయంగా ఈ అక్రమానికి పాల్పడ్డాడా? లేక ఏఈవోలతో కలిసి వ్యవహారం నడిపించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైతుల ఆవేదన

యాసంగి పంటల సమయంలో యూరియా కొరత తీవ్రమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా సరైన సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో టోకెన్ల అక్రమ విక్రయం జరగడం వల్ల అసలైన రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ రైతులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చిన నేపథ్యంలో, ఈ ఆరోపణలపై మండల, జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరతతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >