Posted on 2026-01-10 13:01:20
అప్పుడే మనం అనుకున్న ఆశయం నెరవేరుతుంది
మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ మహోత్సవం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాలలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి విజయం సాధించినప్పుడే మాల జాతి అనుకున్న ఆశయాలు లక్ష్యాలు మాల మహానాడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు చెరుకు రామచందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ శనివారం జిల్లా మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాల సర్పంచులుగా, ఉప సర్పంచ్లు గా వార్డు మెంబర్లుగా విజయం సాధించిన వారికి ఆత్మీయ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆయా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మాల సర్పంచులు 58, ఉపసర్పంచులు గా ఆరుగురుని, వార్డు మెంబర్లుగా 13 మందిని గెలిచిన తమ జాతి బిడ్డలకు సన్మానించుకోవడం ఎంతో కారణంగా ఉందని ఆయన అన్నారు. ఇది శుభ పరిణామమని, జిల్లావ్యాప్తంగా 50 శాతం మన మాల జాతికి చెందినవారు గ్రామపంచాయతీ సర్పంచులుగా గెలవడం సంతోషకరమైన విషయం అన్నారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఎన్నికల్లో మానజాతి కి చెందిన మాలలు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో కూడా తమ ప్రతిభను చాటి తామేంటో చాటి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. మాల సోదరులందరూ ఒకటై ఒకటి గుర్తుంచుకోవాలని రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామని ఎవరూ తొక్కి వేస్తె మనము కుంగి పోకుండా మనలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. వార్డు స్థాయి నుండి రాష్ట్రపతి పదవీ వరకు మన మాల జాతి వారు ఎదిగినప్పుడే మాలల హక్కులను సాధించవచ్చని ఆయన అన్నారు. మాల మహానాడు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు రామచందర్ ను ఘనంగా సన్మానించారు. గా కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కమిటీ అధ్యక్షులు సక్కీ విజయ్, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభంజన్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రేంజర్ల రాజేష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >