| Daily భారత్
Logo




అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన అర్బన్ ఎమ్మెల్యే నివాసం

News

Posted on 2026-01-08 15:14:56

Share: Share


అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన అర్బన్ ఎమ్మెల్యే నివాసం

అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప గురు స్వామి బల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజ

 డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మిర్చి కాంపౌండ్ లోని కిసాన్ వేర్ హౌస్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులతో సహా వారి కుటుంబ సభ్యులు, ఆయన తనయుడు ధన్ పాల్  ప్రణయ్ స్వామి నిర్వహించిన పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. ఎమ్మెల్యే స్వస్థలం కిసాన్ వేర్ హౌస్ వేదికగా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.  అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో "పడిపూజ మహోత్సవాన్ని"  

బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు. పడిపూజ కోసం  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కు చెందిన కిసాన్ వేర్ హౌస్ లో వారి తనయుడు ధన్ పాల్ ప్రణయ్ కుమార్  ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి పూలతో వైభవంగా అలంకరించారు.  వాస్తు పూజ, గణపతి, సుబ్రహ్మణ్య  స్వామి మరియు అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ట, పడిపూజ, అయ్యప్ప స్వామికి అభిషేకం, మంత్రపుష్పం తదితర క్రతువులతో పూజలు నిర్వహించారు. పడిపూజ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ సతీమణి  ధన్ పాల్ మణిమాలతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పడిపూజ మహోత్సవ వేడుకలను తిలకించడానికి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పడిపూజ సందర్భంగా  అయ్యప్ప స్వాములకు, భక్తుల కోసం అర్బన్ ఎమ్మెల్యే  ప్రత్యేకంగా బిక్షను ఏర్పాటు చేశారు.

బల్యపల్లి సుబ్బారావు గురు స్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడే నాయకులు దొరకడం మన అదృష్టమన్నారు. భక్తుల కోసం ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కి, హృదయపూర్వక ధన్యవాదలు తెలిపారు. ఆయన బాటలో వారి తనయులు ఆధ్యాత్మిక బాటలో నడవడం గొప్ప విషయం అని ఆయన తనయుడు ధన్ పాల్ ప్రణయ్ స్వామి అయ్యప్ప మాలధారణ వేసి ఇంత గొప్పగా ఓ పండగ వాతావరణం లో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి పడి పూజ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ హైందవ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువ అపారమని ముఖ్యంగా సంస్కారం, సేవ, పరస్పర గౌరవం, ప్రేమ ఇవన్నీ మన కుటుంబాన్ని నిలబెట్టే వేర్లలాంటివన్నారు. ఈ విలువలన్నింటినీ కాపాడుతూ మన సనాతన ధర్మం వేల ఏళ్లుగా నడుస్తుంది. ప్రపంచం మారినా, యుగాలు మారినా, మన కుటుంబ వ్యవస్థ మాత్రం ధర్మాధారంగా వెలుగుతూ వస్తోందన్నారు. అయ్యప్ప స్వామి భక్తి కూడా అంతే పవిత్రం అని అన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు 41 రోజుల దీక్షలోకి ప్రవేశిస్తారన్నారు. ఈ మాలధారణ అంటే కేవలం ఆచారం కాదని, ఇది మనస్సును శుద్ధి చేసే సాధన, శరీరాన్ని నియంత్రించే నియమం అని అన్నారు. ఆత్మను ఉన్నత స్థితికి చేర్చే మార్గం అని అన్నారు. ఈ 41 రోజులు భక్తులు పాటించే అహింస, సత్యం, సాధన ఇవన్నీ మన సనాతన ధర్మం నేర్పిన విలువలే అని, ఒకరి పై మరొకరికి గౌరవం, సమానత్వం, అన్నదమ్ముల బంధం ఇవే అయ్యప్ప స్వామి భక్తి  అని తెలిపారు.

అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సమాజం లో ఐక్యత,కుటుంబాల్లో ఆనందం, ప్రతి ఇంట్లో  సంపూర్ణ ఆరోగ్యం, సంపద, శాంతి ప్రసాదించాలని స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >